గుండాల జూన్ 29(మన్యం మనుగడ) మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ హాస్టల్ కు పర్మినెంట్ వార్డెన్ ను నియమించాలని గుండాల ఎంపిటిసి ఎస్కే సమ్ధాని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పర్మినెంట్ వార్డెన్ లేకపోవడం వలన విద్యార్థులకు సరైన సౌకర్యాలు ఉండటం లేదు అన్నారు. ప్రస్తుతం ఉన్న ఇన్చార్జి వార్డెన్ ఇల్లందు నుండి వచ్చి పోవడం వలన సిబ్బంది సమయపాలన పాటించకుండా వారికి నచ్చినట్టు వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. పాఠశాలలు ప్రారంభమై చాలా రోజులైనప్పటికీ విద్యార్థులను హాస్టల్లోకి తీసుకోవటం లేదని అన్నారు.8, 9,10 పిల్లలను కూడా హాస్టల్లో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
Navigation
Post A Comment: