CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రైతుబందు సకాలంలో అందించిన రైతు బంధువు కేసీఆర్.

Share it:

 



మన్యం టీవీ దుమ్ముగూడెం :


దుమ్ముగూడెం మండల టిఆర్ఎస్ పార్టీకార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షులు అన్నే సత్యాలు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాగుసాయం అనుకున్న సమయానికి అందించిన రైతు బంధువు గా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు నిరూపించుకున్నారని, తెలంగాణా ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని నిరూపించుకున్నదని,ప్రతిరైతు ఒకప్పుడు తొలకరి పడిందంటే అప్పుల కోసం వడ్డీ వ్యాపారులదగ్గరకు వెళ్లేవారు కానీ,తెలంగాణ ప్రభుత్వం వొచ్చినాక రైతుకు ఏకష్టం రాకుండా రైతు బంధు రైతులకు సాగుకు సాయం చేస్తున్నారని, విత్తనాలు సకాలంలో అందిస్తున్నారని అన్నారు.ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని రైతు పధకాలు తెలంగాణ లొనే ఉన్నాయని రైతుల మన్ననలు పొందుతున్న ముఖ్యమంత్రి ని చూసి విపక్షాలు ఓర్చుకోలేక ఆబండాలు వేస్తున్నారని, కొందరు రైతుబందు పథకాన్ని తప్పుపడుతూనే వారు కుడా రైతుబంధు లబ్ధి పొందుతున్నారు అని తెలిపారు.ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టిన ఈ రైతుబందు సాయం ఆగధని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేసు లక్ష్మీ, జెడ్పిటిసి తెల్లం సీతమ్మ,పార్టీ మండల కార్యదర్శి కణితి రాముడు, అధికారప్రతినిది యం డి జానీపాషా,సర్పంచులు మాట్టా వెంకటేశ్వర్లు,శివాజీ, ఎంపిటిసిలు మడకం రామారావు,పార్టీ ఉపాధ్యక్షులు కామేష్,పార్టీ ప్రచారకమిటి అధ్యక్షలు దామెర్ల శ్రీనివాసరావు,ఉపసర్పంచ్ లు భూపతి,కణితి.వెంకటలక్ష్మి, బీసీ సెల్ అధ్యక్షులు కొమ్ము రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: