మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండలంలోని వాడగూడెం గ్రామపంచాయతీ పరిధిలో గల పాలాయిగూడెం గ్రామంలో బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ప్రమాదవశాత్తు బియ్యని సుశీల ఇంటికి నిప్పు అంటుకొని ఇంటిలోని వంట సామాగ్రి మరియు విలువైన వస్తువులు పూర్తిగా దగ్ధం అయి బాధితురాలు నిరాశ్రయులైంది.ఘటన విషయం తెలుసుకొని తెలుసుకొని వెంటనే స్పందించి శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగరమేష్ బాధితురాలి ఇంటి వద్దకు వెళ్లి పరామర్శించి 2000/-రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇది తన వంతుగా ఒక చిన్న సహాయం మాత్రమేనని మీరు కూడా సహృదయం తో బాధితులకు అండగా నిలవాలని ఈ సందర్బంగా తెలియజేశారు.ఈ సేవా కార్యక్రమంలో శ్రీ రామకృష్ణ సేవా ట్రస్టు సభ్యులు బాడిశ నవీన్, కొమరం వికాస్, మానవ సేవ యూత్ అధ్యక్షుడు జై భీమ్ రామ్మోహన్, జయరాజు, కరకపల్లి నరసింహారావు, బియ్యాని శ్రీను, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: