CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

బృహత్ పల్లె ప్రకృతి వనం పనులను ప్రారంభించిన ఎంపీపీ రేగా కాళిక.

Share it:

 


మన్యం మనుగడ కరకగూడెం: కరకగూడెం మండలం తాటి గూడెం గ్రామపంచాయతీ లో బృహత్ పల్లె పకృతి వనం పనులను శుక్రవారం ఎంపీపీ రేగా కాళిక ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మండల వ్యాప్తంగా ప్రతి గ్రామపంచాయతీలో బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయగా గత సంవత్సరం బట్టు పల్లి పంచాయతీ లో నిర్మాణం పూర్తి చేసుకుంది అని ఆమె అన్నారు. తాటి గూడెం గ్రామ పంచాయతీలో ఏర్పాటవుతున్న బృహత్ పల్లె ప్రకృతి వనం అందంగా తీర్చిదిద్దాలని నీటి సదుపాయం రహదారులు తక్షణం ఏర్పాటు చేయాలని ఆమె అన్నారు. ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమం జరుగుతున్న విధానం సంతృప్తినిస్తుంది అని ప్రతి ఒక్కరూ పల్లెల ప్రగతిలో పాల్గొని గ్రామాలను అందంగా తీర్చిదిద్దాలని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందే విధంగా చూడాలని సంక్షేమ పథకాలు ప్రజలకు అందినప్పుడే ప్రజలు మన ప్రభుత్వాన్ని ఆదరిస్తారని సంక్షేమ పథకాలు అందించాల్సిన బాధ్యత అధికారులు సర్పంచ్ పై ఉందని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ , కొమరం,విశ్వనాథం, ఎంపీడీవో డి. శ్రీనువాసు, ఎంపిఓ. చిరంజీవి,ఆర్ఐ రాజు,కార్యదర్శి వీరన్న, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: