CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వంద రూపాయల కొరకు హత్య.తండ్రిని బండరాయితో మోదీ కొట్టి చంపిన కుమారుడు.

Share it:

 



  • వంద రూపాయలు మద్యానికి అడుగడమె ఘర్షణ కి కారణం?

మన్యం మనుగడ, కరకగూడెం: మండల పరిధిలోని చోప్పాల గ్రామ పంచాయతీలో గల నర్సాపురం గ్రామంలో గత 15 సంవత్సరాల నుండి స్థిర నివాసం ఉంటున్న వలస ఆదివాసి కుంజ .లక్ష్మయ్య (54) సంవత్సరాలు తన చిన్న కుమారుడు బండా రాయితో మోదడం తో అక్కడికి అక్కడే మృతి చెందారు. కుటుంబ సభ్యులు స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి

.గత 15 సంవత్సరల క్రితం వలస వచ్చి స్థిరపడిన వలస ఆదివాసీ కుంజ లక్మయ్య నిత్యం మధ్యం సేవిస్తూ కుటుంబ సభ్యులను తరుచి ఇబ్బందులకు గురి చేస్తూ ఉండే వాడు. ఈ క్రమంలో లక్మయ్య తన కుమారు లను రోజు వారీ లానే మద్యం కొరకు 100 రూపాయలు అడుగడంతో తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆవేశంతో తన చిన్న కుమారుడు మైనర్ 14 సంవత్సరాలు బండా రాయితో ఎడమ చెవి భాగంలో బలంగా కొట్టడంతో కుంజ లక్ష్మయ్య అక్కడి అక్కడే మృతి చెందినట్లు తెలిపారు.మృతుని పెద్ద కుమారుడు కుంజ ఉంగయ్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టు మతం కొరకు మణుగూరు ప్రభుత్వ వైద్యశాలకు పంపినట్లు కరకగూడెం ఎ ఎస్ఐ పాపయ్య, రైటర్ దుర్గరావు తెలిపారు.

Share it:

TS

Post A Comment: