మన్యం మనుగడ, మంగపేట.
పల్లె ప్రగతిలో భాగంగా జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వైవి గణేష్ మంగపేట మండలం కోమటి పల్లి గ్రామ పంచాయతీని ఆకస్మిక పర్యటన సందర్భంగా గ్రామంలో స్మశానవాటిక, సెగ్రిగేషన్ షెడ్, నర్సరీ, పల్లె ప్రకృతి వనం సందర్శించారు. పల్లె ప్రగతి పనులు ఎలా జరుగుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. తదనంతరం బోరు నర్సాపురం లోని రైస్ మిల్లు ను తనిఖీ చేశారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎం డి సలీమ్,ఎంపీడీఓ కర్నాటి శ్రీధర్, మండల పంచాయతీ అధికారి శ్రీనివాస్,రెవిన్యూ ఇన్స్పెక్టర్ కుమారస్వామి,పంచాయతీ కార్యదర్శి స్వర్ణ,ఉన్నారు.
Post A Comment: