గుండాల జూన్ 13(మన్యం మనుగడ) ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక వైద్య శాలలో స్టాఫ్ నర్స్ ఉండేందుకు నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ భవనం 50 లక్షల రూపాయలతో నిర్మించబడుతుంది అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని దృఢసంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య రంగానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో వైద్యశాలను మరింత అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు ప్రసాదరావు, జడ్పీటీసీ రామక్క, ఎంపీపీ సత్యం, తాసిల్దార్ కిషోర్, ఎంపీడీవో హజరత్ వలి, సర్పంచ్ సీతారాములు, వైద్య సిబ్బంది, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు భాస్కర్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Post A Comment: