మన్యం టీవీ చర్ల:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం, ఎర్రంపాడు గ్రామాల్లో సోమవారం సత్యనారాయణ పురం ప్రభుత్వ వైద్య శాల వైద్య సిబ్బంది రాఫీడ్ ఫీవర్ సర్వే నిర్వహించారు. జ్వరం తో బాధ పడుతున్న 5గురిని గుర్తించారు. ఆర్ టి డి పరీక్షల చేసి మందులు అందజేశారు. ఈసందర్బంగా వైద్యురాలు ఎస్, మౌనిక మాట్లాడుతూ, వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తం గా ఉండాలన్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ బారిన పడే అవకాశం ఉందన్నారు. దోమలు వ్యాప్తి చెందకుండా ఇంటి ఆవరణలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. స్వచ్ఛమైన నీటిని తాగాలని సూచించారు. అలాగే చర్ల మండలం తేగడ సుబసెంటర్ పరిధిలో ని గ్రామాల్లో ఇంటెన్సీవ్ డైరెహే కంట్రోల్ ఫార్ట్నైట్ అనే ప్రోగ్రామ్ లో భాగంగా ఇంటి ఇంటికి సర్వే నిర్వహించారు. పిల్లలకు ఓ ఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ టాబ్లెట్స్ అందజేశారు. చిన్నారులు ఆరోగ్యం ఉండేందుకు తల్లి దండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్త ల గురించి వివరించారు. ఈ సర్వే ల్లో వైద్య సిబ్బంది ఏఎన్ యo రాజ్య లక్ష్మి, హెల్త్ అసిస్టెంట్ వేణు, వరప్రసాద్, సుబ్బారావు, ఆశా వర్కర్ ఇన్ దేవయాని ,దేవి తదితరులు ఉన్నారు.
Post A Comment: