మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండలంలో బస్టాండ్ కు స్థలం ఉండి కూడా బస్టాండ్ కట్టడడం లేదు. బస్టాండ్ లేక చుట్టు ప్రక్కల నుండి వచ్చే ప్రజలు ఎండకు వానలకు ఇబ్బందులు పడుతున్నారు 2017- 2018 సంవత్సరం లో అప్పటి అజ్మీర్ చందూలాల్ గిరిజన శాఖ మంత్రివర్యులు వచ్చి బస్టాండ్ కోసం ఎంపీడీఓ ఆఫీస్ ప్రక్కల ఉన్న చెరువును పూడ్పించి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మట్టిపోయించి కొబ్బరి కాయ కొట్టి శంకుస్థాపన చేయడం జరిగింది కానీ, ఇప్పటి వరకు బస్టాండ్ నిర్మాణం ఎందుకు లేదు.
.ప్రబుత్వం నిర్లక్ష్యమా లేదాఆర్టీసీ నిర్లక్ష్యమో ఎందుకు ఇంతవరకు బస్టాండ్ నిర్మాణం జరగలేదు వేంటనే విచారణ జరిపి దాని జాప్య్తానికి బాద్యులపై చర్యలు చేపట్టాలి.ఇప్పుడు అయినా ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు కళ్ళు తెరిచి వెంటనే మంగపేటలో బస్టాండ్ కట్టడానికి పనులు ప్రారంభించాలని మంగపేట ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పి మండల ఇంచార్జి గుగ్గిళ్ల సురేష్ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అదే విధంగా ఏటూరునాగారం లో బస్ డిపో పెట్టాలి, మంగపేటలో
బస్టాండ్ లేదు ప్రతి సంవత్సరం మేడరానికి మంగపేటలో ఉన్న బస్టాండ్ స్థలంలో ప్రజల కోసం బస్సులు వచ్చేవి, ఈ సంవత్సరం ఎక్కడో ఊరు చివరలో పెట్టారు, అక్కడికి చుట్టూ ప్రక్కల నుండి వచ్చే ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఒక సామాజిక కార్యకర్తగా గుర్తించిన ప్రజలు చాలా మంది ప్రజలు బస్టాండ్ కు దారి ఏది అడిగినారు నేను చెప్పాను అమ్మ ఈ దారే పట్టుకొని పొండి చివరకు అని చెప్పడం జరిగింది, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని అధికారులకు తెలియజేస్తున్నాము పబ్లిక్ టాయిలెట్స్ బస్టాండ్ ఆవరణలో కట్టకుండా ఊరు చివరలో గంపోని గూడెంలో కట్టడం జరిగింది, ఆ పబ్లిక్ టాయిలెట్స్ ప్రజలకు ఉపయోగ పడడటం లేదు, బస్టాండ్ ఆవరణలో పబ్లిక్ టాయిలెట్స్ కట్టాలని పేపర్ ప్రకటన ద్వారా ఎమ్మార్వో, ఎంపీడీఓ ఏపీఓ పత్రికా ముఖంగా తెలియ జేస్తున్నాము ప్రజల బాధలు అర్ధం చేసుకోండి సార్లు.... మంగపేట పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా మండల కేంద్రం లో బస్టాండ్ లేదంటే ఇది అవమానం, ప్రజల ఇక్కట్లు తెలుసుకొని ప్రజల సౌకర్యార్ధం బస్సు స్టాండ్ వెంటనే నిర్మాణం చేపట్టాలి. ఈ కార్యక్రమం లో ఎమ్మార్పీఎస్ గ్రామ అధ్యక్షులు గుండెట్టి జంపయ్య, మాదిగ,లంజపెళ్లి ఆదినారాయణ మాదిగ పున్నారావు మాదిగ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: