మన్యం టీవీ దుమ్ముగూడెం :: దుమ్ముగూడెం మండలం లో ములకపాడు సెంటర్లో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను సిపిఎం పార్టీ నాయకులు దగ్ధం చేశారు. హనుమకొండ ఇంటి స్థలాల పోరాటం చేస్తున్న వారిని సందర్శించడానికి వెళ్తున్న అటువంటి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ ను పోలీసులు అతి ఉత్సాహంతో వారిని అక్రమంగా అరెస్టు చేయడం సరికాదని అక్రమ అరెస్టులు చేసి ఉద్యమాలను ఆపలేరని సిపిఎం పార్టీ దుమ్ముగూడెం మండల కార్యదర్శి కారం పుల్లయ్య ముఖ్యమంత్రి కేసీఆర్ ను డిమాండ్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొదటి రాయపర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్టు చేసి మళ్లీ అక్కడినుంచి పాలకుర్తి పోలీస్ స్టేషన్ కు తరలించారు వెంటనే విడుదల చేయాలని పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనా పోరాటాలు చేపడతామని ప్రభుత్వాన్ని అక్రమంగా అరెస్టు చేసిన పోలీసు అధికారులకు హెచ్చరిక చేశారు ఇంటి స్థలాలు లేక ఎన్నో ఏళ్ళ నుండి ప్రభుత్వ స్థలంలో ఇల్లు కట్టి నివసిస్తున్న నిరు పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన వారిని అక్కడ నుండి ఖాళీ చేయాలని దుర్మార్గంగా వ్యవహరిస్తున్నా వంటి ప్రభుత్వ తీరును ఖండిస్తున్నామని ఇట్లాంటి దుర్మార్గమైన ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గర వస్తున్నాయని ఆయన మాట్లాడుతూ సూటిగా ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు యలమంచి వంశీకృష్ణ, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు చంద్రయ్య, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు యలమంచి శ్రీనుబాబు, సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు ఎండి మహమ్మద్ బేగ్, సిపిఎం పార్టీ నాయకులు ఎస్ కె హుస్సేన్ అహ్మద్, కారం శ్రీరాములు, కారం సీతారాములు, కొరస రామ చిట్టి, నాగేశ్వరరావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: