మన్యం మనుగడ ఏటూరు నాగారం
ఏటూరునాగారం మండల కేంద్రము లోని బొడ్రాయి పదో వార్షికోత్సవ పూజలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. బొడ్రాయి , పోతురాజు, భూలక్మి అమ్మవార్లకు పంచామృత అభిషేకాలను అర్చకులు సుదర్శన స్వామి ప్రత్యేక మంత్రోచ్ఛారణల తో జరిపించారు. ముఖ్య అతిథి సర్పంచ్ ఈసం రామ్మూర్తి పాలాభిషేకం చేసి పూజలు చేశారు. మహిళలు అమ్మవారికి చీరె సారలు, గాజులు, ఒడిబియ్యం సమర్పించారు. కుంకుమ, పసుపు చల్లి కొబ్బరి కాయలను కొట్టి నైవేద్యాలు సమర్పించారు. గ్రామాన్ని చల్లగా చూడు తల్లి అని వేడుకున్నారు. బొడ్రాయి నిర్వహకులు పోగుల లక్ష్మినారాయణ సొరకాయను కొట్టి బలి ఇచ్చారు. కార్యక్రమం తాడురి రఘు, అలువాలశ్రీనివాస్ , వేణుగోపాల్ లాహోటి, కత్తెర శ్రీ నివాస్, కుమార్, మహేందర్, ఇర్సవడ్ల భిక్షపతి , కాత యాదగిరి, నూతి రమేష్,, బోజారావు, బేతి భాస్కర్, విజయ్, చెన్న రాంబాబు, బట్టు రమేష్, సంతోష్, వినోద్, లాహోటి రాదేశ్యామ్ పాల్గొన్నారు.
Post A Comment: