CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

విద్యుత్ ప్రమాదానికి ఇల్లు దగ్ధం అయ్యి సర్వం కోల్పోయిన కుటుంబాన్నీ పరామర్శించిన .... యం. ఎల్ ప్రజాపంధా...

Share it:


  •  చిరు సాయంగా బియ్యం ,దుప్పట్లు, బట్టలు, పంపిణీ....
  •  జరిగిన నష్టపరిహారం గుర్తించి ప్రభుత్వం ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి...
  • CPI ML ప్రజాపంధా చర్ల మండల కమిటీ...

 

 మన్యం టీవీ చర్ల: 


నిన్నటి వర్షానికి వీదురు గాలులకు ఉరుములు మెరుపులు కారణంగా విద్యుత్ ప్రమాదం జరిగి చర్ల మండలం లోని సబ్బంపేట గ్రామం లోని కాకా.హనుమంతు అనే నిరుపేద కూలి యొక్క ఇల్లు దగ్ధం అయ్యింది.ఆ కుటుంబాన్ని సీపీఎం యం. ఎల్ ప్రజాపంధా చర్ల మండల నాయకత్వ బృందం పరామర్శించి చిరు సాయంగా బియ్యం, బట్టలు, దుప్పట్లు, ఇవ్వడం జరిగింది..

ఈ సందర్భంగా యం.ఎల్ ప్రజాపంధా మండల నాయకుడు కొండా.చరణ్ మాట్లాడుతూ ఇల్లు దగ్ధమై కాకా.హనుమంతు కుటుంబం సర్వం కోల్పోయిందని మంచం,బట్టలు, గిన్నె,చెంబులు, సమస్తం కాళీ బుడిదయ్యాయని, తృటిలో కాలుతున్న ఇంట్లొచి బయటకువచి ప్రాణాలు కాపాడుకున్నారని అన్నారు.

రోడ్డున పడి దిక్కుతోచని దయనీయ పరిస్థితుల్లో ఈ కుటుంబం ఉందని అన్నాడు..

ప్రభుత్వం తక్షణమే ఈ కుటుంబానికి తగిన సహాయం అందిచి ఆకుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.సేవా కార్యక్రమాలకు చర్ల మండలం పెట్టింది పేరని, నిస్సాహయ పరిస్థితుల్లో ఉన్న ఈ కుటుంబాన్ని సేవాసంస్థలు, ప్రజాప్రతినిధులు, అందరూ కూడా పెద్ద మనుసుతో సహృదయంతో ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో యం. ల్ ప్రజాపంధా చర్ల మండల నాయకులు పాలెం.చుక్కయ్య, లంకా.వెంకట్, ముసలి.సతీష్, వేణు, కాకా.హనుమంథ్ కుటుంబీకులు గ్రామస్థులు సరస్వతి,కాకా.పుల్లయ్య,

ముత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: