- నిర్ధారించని అటవీశాఖ సిబ్బంది..
- పులిని చూసామని చెబుతున్న స్థానికులు..
జూలూరుపాడు జూన్ 30, (మన్యం మనుగడ) ప్రతినిధి, మండల పరిధిలోని బేతాళపాడు అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న వ్యవసాయ పంట పొలాల్లో పులి పాదముద్రలుగా గుర్తించిన రైతులు బుధవారం అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. స్పందించిన జూలూరుపాడు అటవీ రేంజ్ అధికారి ప్రసాద్ రావు తన సిబ్బందితో కలిసి వెళ్లి పరిశీలించారు. కానీ అవి పులి పాదముద్రలు కావని, అటవీ జంతువులైనా హైనా, లేదా తోడేలు పాదముద్రలు అయి ఉండొచ్చునని తెలిపారు. అయినప్పటికీ ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా అటవీ జంతువులు కనిపించినట్లయితే, వాటికి హాని కలిగించకుండా, మాకు సమాచారం అందించాలని కోరారు. అనంతరం గురువారం కొందరు వ్యవసాయ పనుల కోసం బేతాళపాడు సమీపంలోని సోమన్న లొద్ది పరిసర ప్రాంతంలో పులిని కళ్ళారా చూశామని, అటవీశాఖ తవ్విన కందకం అవతలి వైపు పులి వెళుతుండగా గమనించి భయంతో ఇంటి దారి పట్టామని అంటున్నారు. ఇదే రోజు మండల పరిధిలోని కొత్తూరు గ్రామ పరిధిలోని కృష్ణమూర్తి అనే రైతు పంట పొలంలో అటవీ జంతువుల పాదముద్రలు గుర్తించిన రైతులు అవి కచ్చితంగా చిరుత పులి కాలి పాదముద్రలుగా ఆ ప్రాంత పెద్దవాళ్లు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ నిన్న బేతాళపాడు, నేడు కొత్తూరు ప్రాంతంలో పులిసంచరిస్తుందన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. పులి సంచారం విన్నా ఈ ప్రాంత ప్రజలందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు.
Post A Comment: