CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

టిఆర్ఎస్ ప్రభుత్వం తోనే అభివృద్ధి సాధ్యం.క్రీడా మైదానాన్ని ప్రారంభించిన బూర్గంపహాడ్ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత

Share it:



మన్యం టీవీ భుర్గంపాడు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భుర్గంపాడు మండల పరిధి లోని కృష్ణసాగర్ గ్రామం నందు ఏర్పాటు చేసిన క్రీడా మైదానాన్ని మంగళవారం నాడు బూర్గంపహాడ్ జడ్పీటీసీ శ్రీమతి కామిరెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ,టిఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే అభివృద్ధి సాధ్యం అని తెలిపారు.ప్రతి గ్రామం పచ్చదనం తో,పల్లె ప్రకృతి వనాలు,క్రీడా మైదానాలతో పల్లెలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది అని తెలిపారు.పల్లె ప్రగతి కార్యక్రమం అద్భుతమైన ఫలితాలను ఇస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాముల కావాలని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పోడియం ముత్యాలమ్మ స్థానిక సర్పంచ్ కోడెం వెంకటేశ్వర్లు, తహశీల్దార్.భగవాన్ రెడ్డి, ఎంపీడీఓ ఎన్.వివేక్ రామ్, మాజీ జడ్పీటీసీ భూపల్లి నరసింహ రావు,స్థానిక ఉపసర్పంచ్ సొందే గోవింద్, స్థానిక సొసైటీ డైరెక్టర్ ఉండేటి గోవర్ధన్,స్థానిక టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు అంతోటి రమేష్,మండల టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జక్కం సుబ్రమణ్యం,మండల టిఆర్ఎస్ మైనార్టీ అధ్యక్షులు ఎస్కె.సాదిక్ పాషా,స్థానిక టిఆర్ఎస్ నాయకులు కుర్సం వెంకన్న,సోడే పెద్ద వెంకటేశ్వర్లు, భూక్యా ఉపేందర్,స్థానిక వార్డుసభ్యులు రాజేష్,స్థానిక పంచాయతీ సెక్రటరీ నవీన్, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,స్థానిక గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: