మన్యం టీవీ చర్ల:
భద్రాద్రి జిల్లా కలెక్టర్ అనుదీప్ ఇటీవల చర్ల మండలం లోని పుసుగుప్ప అడవి ప్రాంతం వరకు పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా లెనిన్ కాలనీ,వెంకట చెరువు,ఉంజిపల్లీ,వద్దిపేట,పుసుగుప్ప అడవి ప్రాంత గ్రామాల లో ఉండే ఆదివాసులు ఎదుర్కొంటున్న సమస్యలును ప్రత్యక్షంగా వీక్షించిన కలెక్టరు అనుధీప్ స్పందించి చర్ల నుంచి పుసుగుప్ప గ్రామం వరకు ఆర్టీసీ బస్ సౌకర్యం ఏర్పాటు చెయ్యడం జరింది. ఈ బస్సు సౌకర్యం చర్ల లో జరిగే ఆదివారం సంత కు ఆదివాసులు తమ గ్రామాల నుంచి చర్ల వరకు ఈ బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకుంటారని ఏర్పాటు చేయడం చెయ్యడం జరిగింది. బస్సు సౌకర్యాన్ని ఆదివాసీ గిరిజనులు ఉపయోగాన్ని అనుసరించి త్వరలోనే బస్సు సౌకర్యం ప్రతి రోజు ఏర్పాటు చేయుటకు కృషి చేస్తామని ఆర్టీసీ మేనేజర్ తెలపడం జరిగింది. తమ గ్రామాల నుంచి చర్ల వరకు బస్ ను ఏర్పాటు చేయడం పట్ల కలెక్టర్ గారికి హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Post A Comment: