మన్యం మనుగడ, అశ్వారావుపేట: వేసవి సెలవులు అనంతరం పాఠశాలలు పునః ప్రారంభం సందర్భంగా అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు అశ్వరావుపేటలో పలు పాఠశాలలను సందర్శించారు. పాఠశాలలో ఉన్న సమస్యలను పాఠశాల ప్రధానోపాధ్యాయులును అడిగి తెలుసుకున్నారు. అశ్వారావుపేటలో బాయ్స్ హైస్కూల్ మరియు మైనార్టీ గురుకులం బాలికల పాఠశాలను సందర్శించారు. డ్రైనేజీ సమస్య ఉందని తెలపడంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అక్కడే ఉన్న ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామూర్తికి చెప్పి స్థానిక సర్పంచ్ తో మాట్లాడి వెంటనే సమస్యను పరిష్కరించేల చూడమని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జల్లిపల్లి. శ్రీరామమూర్తి, జెడ్పీటీసీ చిన్నం శెట్టి వరలక్ష్మి, అశ్వారావుపేట మండల రైతు కన్వీనర్ జూపల్లి రమేష్, అశ్వారావుపేట సర్పంచ్ అట్టం. రమ్య, తెరాస పార్టి మండల ఉపాధ్యక్షులు బండారి శ్రీను, మండల నాయకులు, మందపాటి మోహన్ రెడ్డి, రవి, నార్లపాటి రాములు, బాణాల నారాయణ, గంధం వేంకటేశ్వర రావు, రఘురాం, ఆలయ చైర్మన్, అర్చకులు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: