మన్యం టీవీ దుమ్ముగూడెం ::
ఈ రోజు నుంచి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాల తలుపులు తెరుచుకున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా విద్యార్థుల చదువుల అస్తవ్యస్తంగా మారిన నేపథ్యంలో 2022-23 విద్యా సంవత్సరానికిగాను నేటి నుంచి పాఠశాలలు తెరిచారు.నిన్నటి వరకు వేసవి సెలవుల ఒడిలో సేదతీరిన చిన్నారులు చదువుల తల్లి ఒడిలోకి చేరుతున్నారు. అందుకు తగినట్టుగానే ఆయా పాఠశాలలో యజమాన్యాలు ఏర్పాట్లు పూర్తి చేశాయి.
విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశారు. మండల పరిధిలోని ప్రాథమిక పాఠశాలలో జడ్పీ స్కూల్ ఆశ్రమ పాఠశాలలు పున ప్రారంభించారు.తరగతి గదులు, బెంచీలు, కిటికీలు, టాయిలెట్లు, నల్లాలు, హ్యాండ్వాష్ సింక్లు, తాగునీటి ట్యాంకులు, ఓవర్ హెడ్ ట్యాంకులు, సంపులు ఇలా ప్రతి ఒక్కదాన్ని శుభ్రం చేయించారు.
Post A Comment: