దమ్మపేట జూన్ 29 ( మన్యం మనుగడ ) : భారత జాతీయ మహిళా సమాఖ్య ఎంఎఫ్ఈ డబ్ల్యూ దమ్మపేట మండల కౌన్సిల్ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ కార్యదర్శి యార్లగడ్డ భాస్కరరావు మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో రోజురోజుకు మహిళలపై దాడులు జరుగుతున్నాయని ప్రభుత్వాలు కళ్లు మూసుకుని కూర్చున్నా యని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే వరకు కేసీఆర్ అనేక బూటకపు మాటలు చెప్పి మహిళలను చిన్నచూపు చూస్తున్నారని మహిళలకు అన్ని రంగాల్లో 50 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మహిళలు ఆర్థికంగా ఎదగాలని డ్వాక్రా గ్రూపు మహిళలకు 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని మహిళలు అన్ని రంగాల్లో ఉన్నారని మహిళలకు ఆర్థికంగా ప్రభుత్వాలు చేయూతనివ్వాలని ఈ సందర్భంగా కోరినారు ఈ కార్యక్రమంలో(ఎంఎఫ్ఈ డబ్ల్యూ)మహిళ కార్యదర్శి. యస్ కే.జనిబేగం. తుపాకుల శాంతి.జాన్ బి. నక్క నాగమణి, వీరలక్ష్మి, కుమారి, వీరమ్మ,గాజుబోయిన కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు
Post A Comment: