CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గ్రామీణ వ్యవస్థాపక అభివృద్ధితోనే ఆధునిక సేద్యం సాధ్యం--:జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి..

Share it:


మన్యం మనుగడ, మంగపేట.

గ్రామీణ వ్యవస్థాపక అభివృద్ధితోనే ఆధునిక సేద్యం సాధ్యం అని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు.బుధ వారం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం జాతీయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు నాబార్డు మరియు అగ్రి హబ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామీణ వ్యవస్థాపక అభివృద్ధి రైతు శిక్షణ కార్యక్రమం లో సాంబశివరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నేటి తరం యువతని వ్యవసాయ రంగం వైపు మళ్ళించడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆర్థిక చేయూతను అందించే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించాలన్నారు. అగ్రి హబ్ ద్వారా అందిస్తున్న అపారమైన అవకాశాలను రైతులు మరియు వ్యవసాయ ఆధారిత వ్యాపారాలు ప్రారంభించాలనె యువత అందిపుచ్చుకోవాలని అందుకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలు అవగాహన సదస్సులను అగ్రి హబ్ నిర్వహించాలని సాంబశివ రెడ్డి కోరారు ములుగు జిల్లాలో మిర్చి సాగులో నాబార్డ్ ఆర్థిక సహకారంతో గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ జి ఏ పి పథకాన్ని అమలు చేయాలని ఆయన కోరారు. అనంతరం ఒకరోజు శిక్షణ పొందిన రైతులకు సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమంలో సాంబశివరెడ్డి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహాయ పరిశోధన సంచారకులు డాక్టర్ ఆర్ ఉమారెడ్డి, డాక్టర్ బలరాం, అసోసియేట్ డీన్ సి ఓ ఏ వరంగల్ ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ అనిల్ కుమార్,వికాస్ అగ్రి పౌండేషన్ వైస్ చైర్మన్ పచ్చిపులుసు నరేష్,అగ్రి హబ్ ఇన్నోవేషన్ డెవలప్మెంట్ మేనేజర్ ముఖేష్, రామగోని మహేష్,ఫార్మ్ నీడ్ అగ్రి బిజినెస్ ఆపరేషన్స్ తెలంగాణ హెడ్ శ్రీమతి సుమన బ్రహ్మ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: