మన్యం టీవీ దుమ్ముగూడెం :
లక్ష్మీనగరం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య నాయకులు సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పై స్థాయి మరిచి అవాకులు,చవాకులు మాట్లాడుతూ,విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు ప్రతిఘటన తప్పదని టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు తునికి కామేశ్వరరావు హెచ్చరించారు.పార్టీలు మారే సంస్కృతి పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీ కాదా,గత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే లను కాంగ్రెసులోకి వలసలు చేసుకోలేదా అని విమర్శించారు. నూతన తెలంగాణా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను తనకు ఓట్లేసిన ప్రజలకు అందించాలనే మంచి ఆలోచనతో ప్రజా సంక్షేమం టిఆర్ఎస్ పార్టీలో చేరి అత్యున్నత స్థాయికి ఎదిగిన రేగా ఎదుగుదలను చూసి తట్టుకోలేక భద్రాచల ఎమ్మెల్యే పొదేం. వీరయ్య విమర్శలకు దిగుతున్నారని,తన నియోజకవర్గ పరిధిలో దుమ్ముగూడెం మండలం లో పోడు వివాదం జరిగితే ఎమ్మెల్యే చుట్టూ గిరిజనులు కాళ్ళు అరిగేలా తిరిగినా పట్టించుకోకుంటే,అదే గిరిజనులు పినపాక ఎమ్మెల్యే కి సమస్య తెలుపగా తక్షణమే స్పందించి మండలంలో పొడుసాగుదారులకు అండగా నిలిచి వాళ్లకు మనోధైర్యంగా పోడు వివాద ప్రాంతాలను పర్యటించింది వాస్తవం కాదా ,నిజాలు మరిచి అబద్దాలు ప్రచారం చేస్తే సహించమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కణితి రాముడు, ఎంపీటీసీ రామారావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాయం వెంకటేశ్వరరావు, గిరిజన విభాగం నాయకులు పోడియం సుబ్బారావు, మట్టా శేఖర్,మడకం భూపతి, పాయం భద్రయ్య, బొర్రా వెంకటేష్,పాయం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: