మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం కల్యాణపురం గ్రామంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఆజ్మీరా సంధ్య కళ్యాణం పురం గ్రామ పంచాయతీ లో తన నివాసానికి వెళ్లి 32000 రూపాయల సి ఎం ఆర్ ఎఫ్ చెక్కును అందజేశారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,పినపాక నియోజకవర్గం ఎస్సీ సెల్ కమిటీ అధ్యక్షులు వెన్నె అశోక్,నాయకులు చిలక వెంకటరమయ్య, ఎస్సీ సెల్ కమిటీ అధ్యక్షులు కోర్స దుర్గారావు, బి సి సెల్ కమిటీ అధ్యక్షులు మామిళ్ళ కనీష్,యువజన నాయకులు మామిళ్ళ రాము,వంశీ,గౌతమ్,గ్రామ పెద్దలు టిఆర్ఎస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: