మన్యం టీవీ దుమ్ముగూడెం ::
దుమ్ముగూడెం మండలం పర్ణశాల పంచాయతీ పరిధిలోని ఎల్ ఎన్ రావు పేట గ్రామం లోని ట్యాంక్ నుండి సాంబశివారావు ఇంటి వరకు 8లక్షల రూపాయలతో 155 మీటర్ల సీసీ రోడ్డు పనులకు సర్పంచ్ వరలక్ష్మి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఖాదర్ బాబు, వార్డు మెంబెర్ పోడియం వెంకటరమణ, సవలం జయ, కో ఆప్షన్ సభ్యులు నాగుల మైడి రాజు, గ్రామ పెద్దలు సాంబశివరావు, పూనెం వీరయ్య, కామరాజు, కాంగ్రెస్ యువనాయకుడు హరి, పంచాయితీ సిబంది ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: