మన్యం మనుగడ మంగపేట
ములుగు :ములుగు జిల్లా కేంద్రంలోని స్థానిక రాష్ట ఉపాధ్యాయ సంఘం(ఎస్టీయు) భవన్ లో ఈరోజు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశం మోహన్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ కుమ్మరి సాగర్ హాజరై మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులు నియంత్రించాలని ఫీజులు చట్టం అమలు ప్రభుత్వ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు పూర్తిస్థాయిలో అందించాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేయడం జరిగింది.ప్రభుత్వాలు విద్యారంగ సమస్యలను గాలికి వదిలేసారని కుమ్మరి సాగర్ ఆరోపించారు. విద్యారంగ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు విద్యాసంస్థలు ప్రారంభమై రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు పాఠ్య పుస్తకాలను పరిస్థితి కాబట్టి వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి ప్రవేటు పాఠశాలల పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు లేనియెడల ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని వారు డిమాండ్ చేశారు . సమావేశంలో
ఎఐఎస్ఎఫ్ నాయకులు అనుముల రాజ్ కుమార్, గుర్రం దేవరాజు ఎండీ పాషా, ప్రవీణ్ కుమార్, దిలీప్, రాకేష్, నవీన్, చందు, సాయి, యాసిన్, శ్రీకాంత్, రాజులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: