మన్యం మనుగడ, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలో కన్నాయిగూడెం గ్రామపంచాయతీలో గ్రామపంచాయతీ సర్పంచ్ గొంది లక్ష్మణరావు ఆధ్వర్యంలో సాముహిక అంగన్వాడి బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రం లో అందిస్తున్న సేవలను వినియోగించుకోవాలన్నారు మూడు సంవత్సరములు దాటిన పిల్లలను గుర్తించి అంగన్వాడీ కేంద్రంలో చేర్పించాలి అన్నారు, ఐదేళ్లు నిండిన పిల్లలను సంబంధిత పాఠశాల లో జాయిన్ చేయాలన్నారు ఆట పాటలతో కూడిన విద్యతో పాటు ఆరోగ్యానికి పౌష్టికాహారం అందించే అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ పి చిట్టెమ్మ, అంగన్వాడీ ఆయా, గ్రామస్తులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: