మన్యం మనుగడ వాజేడు:
నూతన తహసీల్దార్ గా గూడూరు లక్ష్మణ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు.గతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో విధులు నిర్వహించారు. జిల్లా బదిలీలలో వాజేడు మండలం తాహాసిల్దార్ గా బాధ్యతలు స్వీకరించారు. డిప్యూటీ తాహాసిల్దార్ సర్వర్ పాషా, బాధ్యతలను అప్పగించి రెవెన్యూ సిబ్బందిని పరిచయం చేశారు. తాహసిల్దార్ గూడూరు లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
Post A Comment: