మన్యం మనుగడ, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలో ఆన్ని గ్రామాలలో జెండా ఎగురవేసి పండగల జరుపుకోవాలని ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామూర్తి అశ్వారావుపేట మండల ప్రజలకు పిలుపునిచ్చారు. అన్ని గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర అవిర్భవా దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో జెండా ఎగురవేయలని, అలాగె స్వరాష్ట్రం కోసం పోరాడి అశువులు బారిన అమర వీరులకు జోహార్లు అర్పిస్తూ ఒక నిమిషం మౌనం పాటించగలరని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆదేశానుసారం అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర సాధనకు 14 సంవత్సరాలు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రతి కుటుంబానికి ఏదో రకంగా లబ్ధి పొందుతున్నారని, ప్రతి గ్రామంలో మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్లు పల్లె ప్రకృతి వనాలు డంపింగ్ యార్డులు వైకుంఠధామం 24 గంటల కరెంటు రైతుబంధు రైతు బీమా నాణ్యమైన విత్తనాలు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు రాష్ట్రంలో కెసిఆర్ ద్వారా అమలవుతున్నాయని, బంగారు తెలంగాణ కెసిఆర్ తోనే సాధ్యం కావున అభివృద్ధిలో భాగంగా ప్రజలంతా టిఆర్ఎస్ పార్టీతో కలిసి రావాలని ఆయన అన్నారు.
Post A Comment: