CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలకు వరం.టిఆర్ఎస్ పార్టీ మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ

Share it:


మన్యం మనుగడ, మంగపేట.

ములుగు జిల్లా

మంగపేట మండలం

కొత్తపేట(చేరుపల్లి) గ్రామంలో

 ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు వరం టీఆర్ఎస్ పార్టీ మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ అన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పాలన అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుంది అని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ అన్నారు.

ములుగు జిల్లా అధ్యక్షులు ,నియోజకవర్గ ఇంచార్జ్ మరియు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ చొరవతో మంగపేట మండలంలో కొత్తపేట (చేరుపల్లి) గ్రామానికి చెందిన 60 వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు అయింది.

 కొత్తపేట గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేశారు.

 ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ ప్రవేట్ హాస్పిటల్ లో వైద్యం పొంది ఆర్ధికంగా అప్పుల పాలైన వారిని ఆదుకునే లక్ష్యం తో సీఎం కేసీఆర్ ఆలోచనతో వచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ పేదల అభ్యున్నతికి ఉపయోగపడుతుందన్నారు.

తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎంతో మందికి మేలు జరుగుతుందన్నారు.

సీఎం రిలీఫ్ ఫండ్ కింద ప్రభుత్వం అందిస్తున్న ఆర్ధిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

 ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణసోసైటీ చైర్మన్ తోట రమేష్,సొసైటీ డైరెక్టర్లు అచ్చ సత్యనారాయణ, నర్రా శ్రీధర్,మండల సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి, కొత్తపేట గ్రామ కమిటీ అధ్యక్షులు చిట్టిమల్ల బాలకృష్ణ,పార్టీ శ్రేణులు, రంగాని నరేంధర్,యంపెళ్లి చంద్రరావు,దేవేందర్,కుకట్ల చంటి,రాచకొండ గణేష్,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: