CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

డబుల్ బెడ్ రూమ్ డ్రా తీశారు కేటాయింపు మరిచారు..తహశీల్దార్ కార్యాలయం ఎదుట లబ్ధిదారుల నిరసన..సెల్ టవర్ ఎక్కి లబ్ధిదారుల ఆందోళన..

Share it:

 


మన్యం మనుగడ : జూలూరుపాడు, జూన్ 10 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల పరిధిలోని పాపకొల్లు గ్రామపంచాయతీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయింపుకు గత సంవత్సరం లబ్ధిదారులను ఎంపిక చేసి డ్రా తీసి నేటికీ ఏడాది కాలం గడిచినా ఎంపికైన కొంత మంది లబ్ధిదారులకు ఈనాటికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించకపోవడంతో భీమ్లా తండా కు చెందిన కొంత మంది లబ్ధిదారులు శుక్రవారం స్థానిక తాహశీల్దార్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. కొందరు లబ్ధిదారులు తాహశీల్దార్ కార్యాలయానికి సమీపంలో ఉన్న సెల్ టవర్ ఎక్కి మాకు ఇల్లు కేటాయించే వరకు దిగమని ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని లబ్ధిదారులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. డ్రా లో ఎంపికైన మాకు వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలని అధికారులను కోరారు.

Share it:

TS

Post A Comment: