మన్యం టీవీ దుమ్ముగూడెం ::
దుమ్ముగూడెం మండలంలోని ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని ఏవిఎస్పి డివిజన్ అధ్యక్షుడు సొందే మల్లుదొర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అచ్యుతాపురం గ్రామంలో ఉపాధి పనులు చేస్తున్న కూలీల వద్దకు ఏవిఎస్పి బృందం పర్యటించింది. ఈ సందర్భంగా ఉపాధి కూలీలు తమ సమస్యలను వారికి తెలిపారు గత పది వారాలుగా ఉపాధి హామీ పనులు చేస్తున్న ఇంతవరకు కూలీల ఖాతాలోకి వేతనాలు జమ అవ్వలేదని దీంతో ఉపాధి పనులు చేస్తున్న కూలీలు ఆర్థికంగా పలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ఒకపక్క పని చేసిన దానికి డబ్బులు రాక కూలీ పనులు చేస్తున్న ప్రదేశంలో ఎండ వేడిమిని తట్టుకోలేక త్రాగడానికి నీరు లేక ఉపాధి కూలీలు అనేక ఇబ్బందులు పడుతున్నారని కూలీ డబ్బులు చెల్లించకపోతే ఏవిఎస్పీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు .
Post A Comment: