మన్యం మనుగడ, పినపాక :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఆదివాసీ గ్రామం టేకులగూడెం లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉపాధ్యాయుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. టేకులగూడెం లో ని బాల వెలుగు పాఠశాలలో ఉపాధ్యాయుడు శ్రీనివాస్ జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమర వీరుల గురించి గూడెం ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా టేకులగూడెం ప్రజలకు ఉపాధ్యాయుడు శ్రీనివాస్ మిఠాయిలు పంచి పెట్టారు.
Post A Comment: