మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండలం పాలయిగూడెం లో బుధవారం ప్రమాద వశాత్తు బియ్యని సుశీల ఇంటికి నిప్పు అంటుకొని ఇల్లు కాలిపోయింది, ఇంటిలోని అన్ని వస్తువులు సైతం కాలి బూడిద అయింది బాధితురాలు నిలువ నీడ లేక నిరాశ్రయురాలైన విషయం తెలుసుకున్న మంగపేట మండలం గ్రామ ప్రత్యేక అధికారి చేరాలు, గ్రామ పంచాయతీ కార్యదర్శి సలీం పాషా 2000 రూపాయలు ఆర్ధిక సహాయం అందించారు. ఘటన తెలుసుకొని సందర్శిన మండల రెవిన్యూ అధికారులు రెవిన్యూ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్, విలేజ్ రెవిన్యూ ఆఫీసర్ రిజ్వానా ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.
Post A Comment: