మన్యం టీవీ దుమ్ముగూడెం ::
దుమ్ముగూడెం మండలం లోని పల్లె ప్రగతి ఈ కార్యక్రమంలో భాగంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ మరమ్మతు పనులకు ప్రారంభించారు. ఏ ఈ రోహిణి ఆధ్వర్యంలో చిన్న బండిరేవ్, గుర్రాల బైలు, అశోక్ నగర్ కాలనీ బైరాగులపాడు, జెడ్. వీరభద్రపురం, సీతారాంపురం, లచ్చి గూడెం, తూరుబాక గ్రామంలో విద్యుత్ సిబ్బంది మరమ్మతు పనులు చేపట్టారు పల్లె ప్రగతి భాగంగా చిన్న బండిరేవ్ గ్రామం లో విరిగిపోయిన స్తంభాలను కొత్తగా అవసరమైన కరెంట్ పోల్స్ గుర్తించి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి సీతమ్మ, బండిరేవు సర్పంచ్ జయ, ఉప సర్పంచ్ పంచాయతీ కార్యదర్శి, ఆయా గ్రామ సర్పంచులు, గ్రామస్తులు పాల్గొన్నారు..
Post A Comment: