మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన ఆదివాసి కోయగూడెం కేశవాపూర్ గ్రామంలో సుమారు 20 సంవత్సరాలుగా 25 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి .కానీ విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో 20 సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు .రాత్రి అయితే విష పురుగుల బెడద తో భయం భయంగా జీవనం సాగిస్తున్నట్లు గ్రామస్తులు తమvఆవేదనను శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ సభ్యులకు తెలియజేశారు. వారువెంటనే స్పందించి 20 సంవత్సరాలుగా అనుభవిస్తున్న విద్యుత్ సమస్య ను తాత్కాలికంగా నైనా పరిష్కరించాలనే ఉద్దేశంతో శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 35 వేల రూపాయల విలువ గల 90 వాట్స్ కెపాసిటీ గల సోలార్ వీధి లైట్స్ను కేశవాపూర్ గ్రామస్తులకు అందజేశారు. తదుపరి కేశవాపూర్ కోయ గూడెం ప్రజలు తమ చీకటి బతుకుల్లో వెలుగులు నింపిన శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ నాగ రమేష్ కు ఎంతో ఆనందంతో కృతజ్ఞతలు తెలియజేస్తూ, శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామకృష సేవ ట్రస్ట్ చైర్మన్ బాడిష నాగ రమేష్, శ్రీ రామకృష్ణ సేవా ట్రస్టు సభ్యులు బాడిష నవీన్, ముయ బోయిన శివ,జై భీమ్ రామ్మోహన్, మడకం రమేష్. ఇందారపు రమేష్. బొడ ప్రవీణ్ కుమార్, చెట్టుపల్లి రామకృష్ణ కేశవాపూర్ గ్రామస్తులు మలకం మంగయ్య ,ఇర్ప.అర్జున్, దేవయ్య బ్రాహ్మణపల్లి యూత్ కమిటీ సభ్యులు నాగుల వెంకటేశ్వర్లు,నక్క వినోద్,బాడిశ. ఆదినారాయణ, బొగ్గం నరసింహారావు , నక్క నాగరాజు ,దబ్బుల నిరంజన్ ,గార.సందీప్ ,దబ్బుల దామోదర్ ,దార.శ్రీ రాములు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: