మన్యం మనుగడ,మంగపేట.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జాతీయస్థాయిలో మణుగూరు శ్రీ చైతన్య కరికులం విద్యార్థులు ప్రతిభ చాటారని ప్రిన్సిపల్ సాయి కృష్ణ ప్రసాద్ తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన అభినందన సభలో మాట్లాడుతూ,ఐ ఎన్ టి ఎస్ యు లెవెల్ టూ జాతీయ పరీక్షలలో 68 మంది విద్యార్థులు గోల్డ్ మెడల్ మెరిట్ సర్టిఫికెట్స్ పొందారన్నారు.ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో విద్యార్థులు విజయం సాధించడం గర్వకారణమన్నారు.ఈ విజయానికి కారకులైన తల్లిదండ్రులు,ఉపాధ్యాయులను అభినందించారు.ఈ కార్యక్రమంలో డీన్ నరేష్,సి బ్యాచ్ ఇంచార్జ్ టీ నరేష్, ఉపాధ్యాయని ఉపాధ్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: