మన్యం మనుగడ వెబ్ డెస్క్:
జూనియర్ కళాశాల సెంటర్ లో ఉన్న శ్రీ సాయిబాబా వారి మందిరంలో గురువారం నాడు బాబా వారికి అభిషేకం అర్చనలు జరిపారు.స్వర్ణ హారం, స్వర్ణ కిరీటం అలంకరించారు.
పెండెం మురళీ మోహన కృష్ణ దంపతులు అన్నదానానికి 21 వెయ్యి నూట పదహారు విరాళం అధ్యక్షులు తుమ్మలపల్లి సత్యనారాయణ మూర్తి కి అందజేశారు. దాతను అధ్యక్షులు శాలువాతో సత్కరించారు. ఇవి కాక భక్తుల విరాళాల ద్వారా మరో 15 వేల రూపాయలు సమకూరినది అని అన్నారు.
మధ్యాహ్నం 550 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. మరియు వృద్ధాశ్రమం లోని వృద్ధులకు వంద మందికి భోజనం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Post A Comment: