మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఐలాపురం గ్రామంలో గల గిరిజన అశ్రమ బాలికల పాఠశాలలో మూడో తరగతి నుండి 8వ తరగతి వరకు విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రధానోపాధ్యాయురాలు పద్మ తెలిపారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ, ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వం ఇంగ్లీషు మీడియం బోధనను ప్రవేశపెట్టిందని, మెరుగైన విద్యను ఉపాధ్యాయులతో బోధిస్తున్నామని తెలిపారు. అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 3 నుండి 8వ తరగతి వరకు తెలుగు ,ఇంగ్లీషు మీడియం తొమ్మిద,పదవ తరగతి తెలుగు మీడియంలో కూడ అడ్మిషన్లు జరుగుతున్నాయని తెలిపారు.అశ్రమ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని,ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, దుప్పట్లు, కాస్మోటిక్స్ అందజేస్తున్నామని తెలియజేశారు. ప్రవేశం పొందదలచిన వారు టి.సి,స్టడీ సర్టిఫికేట్, కులం , ఆదాయం, సర్టిఫికెట్ లు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, రెండు పోటోలతో పాఠశాలలో సంప్రదించాలని పూర్తి వివరాలకు 9440734788 ఫోన్ నెంబర్ కు సంప్రదించాలని తెలిపారు.
Post A Comment: