గుండాల/ఆళ్ల పల్లి జూన్ 21(మన్యం మనుగడ) ఆళ్ల పల్లి మండలం పరిధిలోని మర్కోడు ఎంపీటీసీ నిధులతో జిన్నేలగూడ నుండి మెయిన్ రోడ్డు వరకు గ్రావెల్ రోడ్డును జెడ్ పి టి సి హనుమంతరావు, ఎంపీపీ మంజు భార్గవి, సర్పంచ్ శంకర్ బాబు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు, అనంతరం వారు మాట్లాడుతూ ఎంపీటీసీ నిధులతో గ్రావెల్ రోడ్డు వేయడం ఆనందంగా ఉందన్నారు, ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు నాయకత్వంలో మండలానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు అవుతున్నాయి అన్నారు, స్థానిక ప్రజాప్రతినిధులకు సైతం నిధులు మంజూరు కావడంతో అంతర్గత రహదారులు మహాదశ ఉన్నాయని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాయ నరసింహారావు, ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు పాల్గొన్నారు
Post A Comment: