CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిష్టిబొమ్మ దగ్నం :- ఆశిష్ మిట్టల్ పై కేసులను తక్షణమే ఎత్తివేయాలి న్యూ డెమోక్రసీ

Share it:

 


గుండాల జూన్ 20(మన్యం మనుగడ) ఉత్తర ప్రదేశ్ బిజెపి ప్రభుత్వం ఏ ఐ కె ఎమ్ ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆశిష్ మిట్టల్ పై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిష్టిబొమ్మను న్యూ డెమోక్రసీ నాయకులు సోమవారం మండల కేంద్రంలో దగ్ధం చేశారు. అనంతరం గుండాల ఎంపీపీ మాట్లాడుతూ ప్రజల కోసం, రైతుల కోసం పోరాడే నాయకులపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తప్పుడు కేసులు పెట్టి నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఆశిష్ మిట్టల్ పై 29 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. బిజెపి కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పోలీస్ కాల్పుల్లో చనిపోయిన దామెర రాకేష్ కు 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సీతారాములు పీ వై ఎల్ జిల్లా కార్యదర్శి రవి, ఐఎఫ్టియు జిల్లా నాయకులు వై వెంకన్న, ఉప సర్పంచ్ ఉపేందర్, మండల నాయకులు లాలు, సారయ్య, కృష్ణ , వెంకటేశ్వర్లు, రియాజ్, లాలయ్య, పి డి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షుడు రాజేష్ తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: