CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

దళిత బంధు పథకం దేశానికే ఆదర్శం:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు.

Share it:

 


మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు శుక్రవారం నాడు మణుగూరు టౌన్ టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి గుర్రం సృజన్ కి దళిత బంధు పథకంలో మంజూరైన ట్రాక్టర్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు కాంతారావు లబ్ధిదారుని తో కలిసి టాక్టర్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్థికంగా గా ఎదగాలన్న లక్ష్యంతోనే సీఎం కేసీఆర్,దళిత బంధు పథకాన్ని రుపొందించారని,ప్రతి దళిత కుటుంబానికి ఎలాంటి బ్యాంకు లింకేజీ లేకుండా వ్యాపారాల నిమిత్తం రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తున్నరని ఆయన తెలిపారు.తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం గా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో దళిత సాధికారత తెచ్చిన మహోన్నతుడు మన సీఎం కేసీఆర్ అని కొనియాడారు.దళితులు ఆర్థిక ఎదుగుదలకు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ కు దళితులంతా రుణపడి ఉంటారన్నారు. దేశంలోని చాలా రాష్ట్రాలు తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను ఆదర్శంగా తీసుకుంటున్నాయని వారు తెలిపారు.దళిత బంధు పథకంతో అనేక దళిత కుటుంబాలు సామాజికంగా అభివృద్ధి చెందుతాయని అన్నారు.ఎస్సీ,ఎస్టీ మైనార్టీ గురుకులాల ను ఏర్పాటు చేసి దళిత బిడ్డలు విద్యావేత్తలు ఎదిగేఅందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థికి ఏడాదికి లక్షా 25 వేలను ఖర్చు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మణుగూరు మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ,అభిమానులు, పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం.నర్సింహారావు, పీఏసీఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,కో ఆప్షన్ సభ్యులు జావిద్ పాషా,స్థానిక ప్రజా ప్రతినిధులు,టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు,టిఆరేస్వి రాష్ట్ర కార్యదర్శి ఎన్ ఎన్ రాజు,కార్యదర్శి నవీన్, నియోజకవర్గ యువజన కార్యదర్శి రవి ప్రసాద్,పార్టీ నాయకులు ఎడ్ల శ్రీను,మేకల. రవి,బాబీజాన్,రామకోటి గణేష్,యువజన నాయకులు స్థానిక నాయకులు,పార్టీ కార్యకర్తలు,యువజన నాయకులు,మహేష్,రంజిత్,మహిళా అధ్యక్షురాలు, రమాదేవి,చంద్రకళ,మహిళ కార్యకర్తలు,టిఆరేస్వి నాయకులు రాహుల్ గౌడ్, చరణ్,సోషల్ మీడియా సభ్యులు సురేందర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: