గుండాల/ఆళ్ల పల్లి జూన్ 14(మన్యం మనుగడ) ఆళ్ల పల్లి మండల కేంద్రంలో జి సి సి ద్వారా నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రం వచ్చే సంవత్సరం నుండి పిఎసిఎస్ ద్వారా కొనుగోలు చేసే విధంగా చర్యలు చూపాలని జిల్లా పరిషత్ సమావేశంలో ఆళ్ల పల్లి ఎంపీపీ మంజు భార్గవి కోరారు. జిసిసి ద్వారా కొనుగోలు కేంద్రం నిర్వహించడం వలన సరైన నిర్వహణ లేక ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆమె అన్నారు. ప్రజా ప్రతినిధులు అధికారులు స్పందించి పిఎసిఎస్ ద్వారానే కొనుగోలు సాగే విధంగా చూడాలన్నారు. వీటితో పాటు మండలంలోని పోడు భూముల సమస్యలు, ఇతర సమస్యలను సైతం జడ్పీ సమావేశంలో ఆమె ప్రజాప్రతినిధులకు అధికారులకు వివరించారు.
Post A Comment: