మన్యం టీవి దుమ్ముగూడెం ::
బిజెపి ప్రభుత్వం అధికారం చేపట్టి ఎనిమిది సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ ఎనిమిది సంవత్సరాల నుండి అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను, తెలియజేస్తూ ఇంటింటికి తిరిగితూ దుమ్ముగూడెం మండలంలో ని లక్ష్మినగరం గ్రామంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు తెల్లం శేఖర్ ఆద్వర్యంలో కరపత్రాలను పంచడంజరిగింది
ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బిట్రగుంట క్రాంతి కుమార్,SC మోర్చ జిల్లా కార్యదర్శి జెట్టి వెంకట రాజులు మాట్లాడుతూకేంద్ర ప్రభుత్వం పేదల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని స్వచ్ భారత్ మిషన్ మరుగుదొడ్లు,ఇంకుడు గుంతలు,అలాగే మహిళలకు ప్రధానమంత్రి ఉజ్యల గ్యాస్ 9 కోట్ల మందికి ,కరోనా కస్టకాలంలో 80 కోట్ల మందికి ఉచిత బియ్యం అలాగే ఉచిత వ్యాక్సిన్ లు, రైతులకు ఎకరాకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు పండించిన పంటకు మద్దతు ధరలు, జన్ ధన్ ఖాతాలురుణాలు ఇలా ప్రజలకు చేరువ చేసి కేంద్ర ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కండ్రపు త్రినాధ్ రెడ్డి,కొర్సా రమేశ్,ధంగేటి సత్యనారాయణ నిమ్మనగోటి రవి, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: