CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గాలివాన బీభత్సవానికి మూగజీవాలు బలి..!

Share it:

 



మన్యం మనుగడ : జూలూరుపాడు, జూన్ 15 మండల పరిధిలోని సూరారం గ్రామ అటవి ప్రాంతంలో మంగళవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. ఈ గాలివాన ప్రతాపానికి భారీ చింత చెట్టు నేలకొరగడంతో చెట్టుకింద నిలబడి వున్న పశువుల నాలుగు మృతి చెందగా మరికొన్ని గాయాల పాలయ్యాయి. వివరాలలోకి వెళ్తే సూరారం గ్రామానికి చెందిన కట్ల పిచ్చమ్మ, బాజీన్ని వెంకన్న, దాసరి నరసింహారావు, రెడ్డిబోయిన నరసింహారవులు, ఇటీవల వ్యవసాయ పనులకోసం కొనుగోలు చేసిన పశువులు, వాటితో పాటు మరికొంత మంది రైతుల పశువులు అటవీ ప్రాంతానికి మేతకు వెళ్లగా సాయంత్ర సమయంలో గాలి వాన బీబత్సానికి రాత్రంతా పశువులు ఇంటికి తిరిగి రాకపోవడంతో కంగారు పడ్డ రైతులు, పశువులను వెతుకుతూ అటవీప్రాంతానికి వెళ్లి చూడగా, పెద్ద చింతచెట్టు నేలకొరిగింది. చెట్టుకింద విగత జీవిగా పడివున్న నాలుగు పశువులను చుసిన రైతులు కన్నీరు మున్నీరయ్యారు. చనిపోయిన పశువుల విలువ సుమారు 2లక్షల 40 వేల వరకు ఉంటాయాని రైతులు తెలిపారు. విషయం తెలుసుకున్న మండల పశు వైద్య అధికారి సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు.

Share it:

TS

Post A Comment: