మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ :భూ వివాదంలో చోటు చేసుకున్న ఘర్షణలో నలుగురికి గాయాలైనా సంఘటన బుధవారం మండలంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి... పోకలగూడెం గ్రామానికి చెందిన గంగరాజు, శ్రీను,పొడలా వెంకన్న, తొర్లపాటి నర్సింహరావులు తమకు గల ఆరు ఎకరాల భూమి లో దుక్కి దున్నెందుకు వెళ్లగా ప్రత్యర్థి వర్గానికి చెందిన కిన్నెర తిరుపతయ్య, అతని మద్దతుదారులు దాడి చేశారు. ఈ దాడిలో గంగరాజు, శ్రీను, వెంకన్న, నరసింహారావు లు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో బుధవారం రాత్రి ఫిర్యాదు చేశారు. ఎస్ఐ విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.
Post A Comment: