మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం లోని తెరాస పార్టీ కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా గురువారం నాడు జాతీయ జెండాను ఎగరవేసిన అశ్వాపురం మండలం టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన టిఆర్ఎస్ పార్టీ తోనే తెలంగాణ ప్రాంతం అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించారని అన్నారు.తెలంగాణ ఉద్యమం కాలంలోనే అన్ని ప్రాంతాలను తిరిగిన కెసిఆర్ గారు ప్రజలు పడుతున్న ఇబ్బందులను కళ్లారా చూశారు అన్నారు. వాటిని ఆయన ముఖ్యమంత్రి అయ్యాక పరిష్కరిస్తారని తెలిపారు.వేల కోట్ల రూపాయల నిధులను వివిధ ప్రాంతాలకు మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు, ప్రాజెక్టులను నిర్మించి ప్రజలకు సాగు , తాగునీటిని అందిస్తున్నారని అన్నారు.తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతోమంది ప్రాణత్యాగం చేశారని అన్నారు , అమరుల త్యాగాలు మరువలేనివని, అన్నారు వారి ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. రాష్ట్ర సాధనలో ప్రజలను ఏకతాటి పైకి తీసుకురావడానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేశారని తెలిపారు. తెలంగాణలోని ప్రజలందరి సంక్షేమం కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం పాటుపడుతున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండలం వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,సీనియర్ నాయకులు ఈదార సత్యనారాయణ,చంచ్చు రామ్మూర్తి,యువజన విభాగం అధ్యక్షులు గద్దల రామకృష్ణ,యువజన ప్రధాన కార్యదర్శి కోరేం రామారావు,నియోజకవర్గ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మంగళగిరి రామకృష్ణ, బిసి సెల్ కమిటీ అధ్యక్షులు మామిళ్ల కనీష్, ఎస్ టి సెల్ కమిటీ అధ్యక్షులు కోర్స దుర్గారావు, మైనార్టీ మండల అధ్యక్షులు నాయుమ్, అశ్వాపురం మండల ప్రచార కార్యదర్శి గడకరి రామకృష్ణ,అశ్వాపురం మండల సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి గజ్జి లోహిత్ ,యువజన నాయకులు ,జూపల్లి వాల్లి,గుగులోత్ రవి,కావటి శ్రీకాంత్ ,ప్రవీణ్,సతీష్,జేఏసీ నాయకులు కుక్కల రాంబాబు,జినాక ప్రభాకర్,హరిగేలా గురు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: