దమ్మపేట జూన్ 02 ( మన్యం మనుగడ ) : పట్వారీగూడెం గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు హాజరై ఘనంగా నిర్వహించారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులకు పేద మధ్యతరగతి కుటుంబాలకు భరోసా కల్పించిందని ,అనేక రకాల పథకాలను ప్రవేశపెట్టి ప్రజలందరికీ అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు,దొడ్డాకుల రాజేశ్వరరావు,కొయ్యల అచ్యుతరావు,సర్పంచ్ మొగిలి అంజలి,ఎంపీటీసీ కూరం కమల,ఉప సర్పంచ్ రెడ్డిమల్ల నాగయ్య,రాయల నాగేశ్వరరావు,బొల్లికొండ ప్రభాకర్,బొజ్జా రమేశ్,చెలికాని భాస్కరరావు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: