మన్యం మనుగడ ఏటూరు నాగారం
ములుగు జిల్లా లో బస్ డిపో ఏర్పాటు కొరకు పోరాడుతున్న ఆస్క్ ఫౌండేషన్ అధ్యక్షులు అన్నవరం రవికాంత్ శుక్రవారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ను కలిసి మద్దతు కోరడం జరిగింది.ములుగు జిల్లా ప్రాంత వాసుల రవాణా సౌలభ్యం కోసం ములుగు జిల్లా లో బస్ డిపో ఏర్పాటు చేయటంలో సహకరించాలని ఆస్క్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అన్నవరం రవికాంత్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నీ కలిసి వినతి పత్రం అందజేశారు.శుక్రవారం వారిని హైద్రాబాద్ లో కలిసి ములుగు జిల్లా ప్రజల సమస్యల గురించి చర్చించి వాటి పరిష్కారానికి సహకరించాలని కోరారు.
ములుగు జిల్లా కు వాహన రిజిస్ట్రేషన్ కోడ్ కేటాయించి నప్పటికి రిజిస్ట్రేషన్ ఆఫీస్ లేకపోవడం వల్ల ములుగు జిల్లా ప్రజలు భూపాలపల్లి కి వెళ్లి రావాల్సి వస్తుందని తెలిపారు.ములుగు ప్రాంతం అభివృద్ధి లో చాలా వెనుక పడిందని, కనీస అవసరం అయిన రవాణా వ్యవస్థ అందుబాటులో లేదని,రాత్రి వేళలో ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో వరంగల్ కేంద్రానికి రాకపోకల కి జిల్లా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయన కి వివరించారు.ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ. మారుమూల ప్రాంతం అయినటువంటి ములుగు జిల్లాకు ప్రజల రవాణా దృష్ట్యా బస్ డిపో అవసరం ఉంది అని, డిపో ఏర్పాటు కు, రవాణా శాఖ కార్యాలయం, మరియు ఇతర ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు కు తనవంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు.
Post A Comment: