భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిడబ్ల్యూజేఎఫ్ మహాసభలకు సన్నద్ధం కావాలని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్ర అనిల్ రెడ్డి జర్నలిస్టులకు పిలుపునిచ్చారు. చర్ల మండల కేంద్రంలో తోట మల్ల రమణమూర్తి (ఆంధ్రప్రభ), వర్మల ఆధ్వర్యంలో చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ద్వితీయ మహాసభలకు జిల్లా వ్యాప్తంగా చిన్న, పెద్ద పత్రికలు అనే తేడాలేకుండా పనిచేస్తున్న విలేఖరులందరూ టీడబ్ల్యూజేఎఫ్ మహాసభలు విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరారు. జర్నలిస్టులు సమాజానికి నాలుగో స్తంభమని గుర్తు చేశారు. ఒక్క సిరా చుక్క 1000 మెదళ్లను కదిలించే శక్తి ఉంటుందని, అటువంటి జర్నలిస్టు వృత్తి లో ఉన్న జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని ఆ దాడులను టీడబ్ల్యూజేఎఫ్ తీవ్రంగా ఖండిస్తుదన్నారు. జీతభత్యాలు లేకపోయినా వృత్తి కోసం పాకులాడే జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు, ఇల్లు, ఇళ్ళ స్థలాలు, హెల్త్ కార్డులు ప్రభుత్వం ద్వారా అందే సంక్షేమ పథకాలన్ని జర్నలిస్టులకు అందాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు డి. రవికుమార్, భద్రాచలం డివిజన్ అధ్యక్షులు పి. సూరిబాబు, కోశాధికారి జి. వెంకటేశ్వర్లు పాల్గొని సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడబ్ల్యూజేఎఫ్ సభ్యత్వం పొందిన వారిలో సత్తిబాబు, సాల్మన్ రాజు, శివ శంకర్, ఎం చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.
Post A Comment: