గుండాల జూన్ 10(మన్యం మనుగడ) గుండాల,ఆళ్లపల్లి మండల ప్రజలకు నిరంతరాయం విద్యుత్ అందించాలన్న సంకల్పంతో విద్యుత్ అధికారులు నిరంతరం కృషి చేస్తుంటారు. శుక్రవారం సాయంత్రం భారీగా వచ్చిన ఈదురుగాలులకు విద్యుత్ లైను పై పడడంతో చీకటిని సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ ఏఈ రవి తన సిబ్బందితో కలిసి కాంచనపల్లి అడవిలో మరమ్మతులను చేసి విద్యుత్తును పునరుద్ధరించారు. చీకటిని సైతం లెక్కచేయకుండా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించిన విద్యుత్ శాఖ అధికారులకు మండల ప్రజలు కృతజ్ఞత తెలుపుతున్నారు
Post A Comment: