మన్యం టీవీ దుమ్ముగూడెం ::
దుమ్ముగూడెం మండలం చిన్న బండిరేవు గ్రామంలో సీతమ్మ ప్రాజెక్టు భూములు కోల్పోయిన ఎస్ కొత్తగూడెం, కాశీనగరం, బండిరేవు గ్రామస్తులు ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మా భూములకు నష్ట పరిహారం చెల్లించకుండా సీతమ్మ ప్రాజెక్టు పనులు సంబంధిత కంపెనీ చేపడుతుందని అలానే బ్లాక్ కరకట్ట నిర్మిస్తున్నారని మాకు నష్టపరిహారం చెల్లించే దాకా సంబంధిత కంపెనీ లారీలను నిలిపి వేయడం జరిగిందని మాకు న్యాయం జరగకపోతే పురుగుల మందు తాగి చనిపోతాం అని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా చిన్న బండిరేవ్ గ్రామంలో చర్ల భద్రాచలం ప్రధాన రహదారిపై గంటసేపు ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది విషయం తెలుసుకున్న దుమ్ముగూడెం సిఐ దోమల రమేష్ బాధిత రైతులతో ఫోన్ లో మాట్లాడి సంబంధిత కంపెనీ అధికారులతో మాట్లాడి మీకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాధిత రైతులు యమన వెంకటేశ్వరావు, ఐలయ్య, అనిల్, ప్రదీప్, సుధాకర్, ప్రేమ్, తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: