మన్యం టీవీ దుమ్ముగూడెం ::
దుమ్మగూడెం లో గల మినీ హైడల్ పవర్ ప్రాజెక్టు లో పనిచేస్తున్న కార్మికులకు 2021 ఏప్రిల్ నెల నుండి సెప్టెంబర్ నెల వరకు రావాల్సిన ఆరు నెలల బకాయిలను వెంటనే చెల్లించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు అప్పారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు పవర్ ప్లాంట్ డిప్యూటీ జనరల్ మేనేజర్ జనార్ధన రావు యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా గా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం వి అప్పారావు మాట్లాడుతూ 2021 ఏప్రిల్ నుండి చెల్లించాల్సిన ఆరు నెలల బకాయిలను చెల్లించకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కార్మికులకు ఆరు నెలల కాలానికి 3750 రూపాయలు కార్మికులకు 4371 రూపాయలు డి ఎ చెల్లించవలసి ఉన్నదని సిఐటియు నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ సి ఐ టి యు జిల్లా అధ్యక్షులు కొలగని రమేష్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె బ్రహ్మాచారి, పవర్ ప్రాజెక్ట్ యూనియన్ నాయకులు ప్రకాష్, నరేంద్ర ,రాంబాబు, రమేష్ ,సతీష్, చిరంజీవి, అనంతరావు, అరవిద్
తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: